
Latest Telugu Movie News
Telugu Movie news
కుబేర మూవీ రివ్యూ
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్
నటీనటులు: ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక మందన్నా, జిమ్ సర్భ్, దలిప్ తాహిల్, సునైనా, హరీష్ పేరడి, షాయాజి షిండే, భాగ్యరాజ్ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మి
నిర్మాతలు: సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్ రావు
రచన-దర్శకత్వం: శేఖర్ కమ్ముల
రిలీజ్ డేట్ 20/06/25
క్లీన్ అండ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల నుంచి సినిమా వచ్చి నాలుగేళ్ళయ్యింది. లవ్ స్టోరీ తర్వాత ఆయన నుంచి నాలుగేళ్ళ గ్యాప్ తో నేషనల్ అవార్డు విన్నర్ ధనుష్, సీనియర్ స్టార్ హీరో నాగార్జున తో కలిసి మల్టీస్టారర్ మూవీగా కుబేర చిత్రాన్ని రెడీ చేసి జూన్ 20న ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. లీడర్ దగ్గర నుంచి ఆనంద్, హ్యాపీ డేస్, గోదావరి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఫిదా, లవ్ స్టోరీ లాంటి ఫీల్ గుడ్ చిత్రాలను తెరకెక్కించిన శేఖర్ కమ్ముల నుంచి వచ్చిన కుబేర చిత్రం ఫస్ట్ లుక్ తోనే సినిమాపై ఆసక్తిని కలిగించింది. హీరో ధనుష్ ని బెగ్గర్ లుక్ లో చూపించగానే అందరూ షాకయ్యారు, ఆ తర్వాత వదిలిన పోస్టర్స్, టీజర్, కుబేర ట్రైలర్ అన్ని సినిమాపై అంచనాలు క్రియేట్ చేసాయి. సక్సెస్ ఫుల్ హీరోయిన్ రష్మిక కూడా నటించడంతో కుబేర పై ప్రత్యేక ఆసక్తి చూపించారు ప్రేక్షకులు. మరి ప్రేక్షకుల అంచనాలను 3.13 నిమిషాల రన్ టైమ్ తో కుబేర ఎంతవరకు రీచ్ అయ్యిందో అనేది సమీక్షలో తెలుసుకుందాం..
కుబేర స్టోరీ రివ్యూ:
కుబేర కథ గొప్ప కథ అని చెప్పలేము, అలాగని తీసిపారేసే కథ కూడా కాదు. రొటీన్ స్టోరీ నే దర్శకుడు డిఫరెంట్ గా చూపించారు. లక్ష కోట్లు విలువ చేసే సహజ వనరులను ప్రజలకు, ప్రభుత్వానికి అందకుండా కొట్టెయ్యాలని ప్లాన్ చేసే విలన్, అతనికి సహాయం చేసేందుకు వచ్చిన నిజాయితీ గల మాజీ సీబీఐ ఆఫీసర్, వీరి నడుమ అక్షరం ముక్క రాని ఓ బిచ్చగాడు, ఆ బిచ్చగాడు ఆ లక్ష కోట్లని, విలన్ ని సీబీఐ ఆఫీసర్ ని ఎలా డీల్ చేసాడు అనేదే కుబేర కథ.
కుబేర ఎఫర్ట్స్:
ధనుష్ నటన గురించి ప్రత్యేకంగా మరోసారి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కుబేర చిత్రంలో బిచ్చగాడిగా దేవా పాత్రలో ధనుష్ నటించడం కాదు జీవించేశారు. కుక్కల పక్కన పడుకోవడం, చెత్తలో పడి దొర్లడం, మనం నిత్యం చూసే బిచ్చగాళ్ళు ఎలా ఉంటారో అచ్చం అలానే ధనుష్ కనిపించి మెప్పించారు. లుక్ విషయంలోనే కాదు తినే విధానం, మాట్లాడే మాట, నడిచే తీరు అన్ని విధాలుగా ధనుష్ కెరీర్ బెస్ట్ ఇచ్చేసారు. ఫైనల్ గా ఈ పాత్రలో ధనుష్ని తప్ప వేరే ఎవరినీ ఊహించలేరు.
నాగార్జున మాజీ సీబీఐ అధికారిగా కథని మలుపు తిప్పే పాత్రలో నిజాయతీపరుడిగా నటించారు. నాగార్జున నటనకు వంక పెట్టేందుకు ఏమి ఉండదు, అంత సీనియర్ హీరో ఇలాంటి పాత్రలో కనిపించడం ప్రశంసించ దగ్గ విషయం.
రష్మిక మందన్న సాదా సీదా గా సింపుల్ గానే అనిపించినా కథకి ఉపయోగపడే పాత్రలో కనిపించింది. ఎలాంటి గ్లామర్ షో లేదు అయినా ఆడియన్స్ కి ఆమె పాత్ర కనెక్ట్ అవుతుంది. విలన్గా చేసిన జిమ్ సర్బ్ అటు బిజినెస్మ్యాన్గా ఇటు క్లైమాక్స్లో ఎవరూ ఊహించని ఒక అవతారంలో చాలా బాగా నటించారు. మిగిలిన వారంతా తమ పాత్రలకి న్యాయం చేశారు.
సాంకేతికంగా.. సినిమా విడుదలకు ముందు సాంగ్స్ అంత మెప్పించకపోయినా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకి ప్లస్ అయ్యింది. ముఖ్యంగా పోయిరా పోయిరా మావా, తల్లి మీద వచ్చిన సాంగ్ విజువల్ గా ఆకట్టుకున్నాయి. దేవిశ్రీ ఇచ్చిన BGM కూడా బాగా వర్కౌట్ అయ్యింది. సినిమాటోగ్రఫీ కూడా చాలా సహజంగా ఉంది. సినిమా నిడివి దాదాపు 3 గంటల 13 నిమిషాలు ఉంది. అక్కడక్కడా ట్రిమ్ చేస్తే బావుండేది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.
కుబేర స్క్రీన్ ప్లే రివ్యూ:
లవ్ అండ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల చిత్రాలకు క్లాస్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. ఆయన చిత్రాలు నీట్ గా, క్లాస్ గా ఆకట్టుకుంటాయి. అలాంటి దర్శకుడు కుబేర లాంటి కథ అంటే బిచ్చగాడు స్టోరీ తో సినిమా చేస్తున్నాడు అంటే.. అందరూ ఆశ్చర్యపోయారు. ఆ కథ ఏమిటి అనేది అర్ధం కాకపోయినా.. కుబేర ఫస్ట్ లుక్ లో ధనుష్ ని బిచ్చగాడిగా చూసాక శేఖర్ కమ్ముల ఏంటి.. ఇలాంటి కథ ఎంచుకున్నాడు అనే అనుమానం అందరిలో కలిగింద. కుబేర ట్రైలర్ చూసాక కూడా ఓ అంచనాకు రాని ప్రేక్షకుడు.. థియేటర్స్ కి వెళ్లి కుబేర చిత్రాన్ని వీక్షించాక వావ్ అంటూ ఫీలవుతున్నారు. శేఖర్ కమ్ముల నుంచి డిఫరెంట్ మూవీ అంటూ ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుకుంటున్నారు. రొటీన్ కథనే తనదైన మార్క్ తో తెరకెక్కిస్తే ఆడియన్స్ కనెక్ట్ అవుతారని శేఖర్ కమ్ముల నిరూపించారు. లక్షల కోట్లకు అధిపతి కావాలనుకునే వ్యక్తి జనాలకు దక్కాల్సిన సహజవనరుల కోసం ప్రభుత్వాన్నే మోసం చేసి, దానికోసం జైలులో ఉన్న నిజాయితీ సీబీఐ ఆఫీసర్ ని తనవైపుకు తిప్పుకుని, ఆ డబ్బు కొట్టెయ్యడానికి బిచ్చగాళ్లను వాడుకోవడమనే కాన్సెప్ట్ మాత్రం ఆడియన్స్ కు బాగా రీచ్ అయ్యింది. బిచ్చగాడు టూ బిలియనీర్ అంటూ సింపుల్ స్టోరీనే మూడు గంటల పాటు బిగి సడలకుండా నరేట్ చేయడం సామాన్యమైన విషయం కాదు. కుబేర లో కనిపించిన పాత్రలన్నీ అత్యంత సహజంగా కనిపించడం సినిమాకి పెద్ద ప్లస్. హీరో-విలన్-హీరోయిన్-పాటలు అంటూ రూల్స్ పెట్టుకోకుండా, అభిమానుల కోసం హైప్ పెంచేందుకు హీరోల ఎలివేషన్ వెయ్యకుండా కుబేర ని చాలా సహజసిద్ధంగా శేఖర్ కమ్ముల డిజైన్ చేసిన తీరు అద్భుతమని చెప్పాలి. కొన్ని కొన్ని అంటే సెకండ్ హాఫ్ లో లాగ్ సన్నివేశాలు, కొన్ని సీన్లలో లాజిక్కులు మిస్సవడం.. అక్కడక్కడా సన్నివేశాలు కన్వీనియెంట్ గా సాగడం.. లాంటి మైనస్ లు ఉన్నా ఓవరాల్ గా కుబేర ప్రేక్షకులను ఇంప్రెస్స్ చేస్తుంది అనడంలో సందేహం లేదు.
కుబేర ఎనాలసిస్:
దర్శకుడు శేఖర్ కమ్ముల తన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి అతను అందించిన సర్ప్రైజ్ కుబేర. డల్ గా ఉన్న బాక్సాఫీసుని తట్టి లేపింది కుబేర. సమ్మర్ హాలీ డేస్ కరిగిపోయినా.. నిస్సత్తువుగా పడివున్న బాక్సాఫీసు కి కుబేర కటాక్షంలా మారింది ఈ చిత్రం, కుబేరకు వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ రెండువారాల పాటు కొనసాగితే నిర్మాతలకు లాభాలు వస్తాయి, ప్రేక్షకులు ఓ మంచి ఫీల్ గుడ్ మూవీ చూశామన్న తృప్తిని కుబేర మిగులుస్తుంది. కుబేర లాంటి చిత్రాన్ని ఒక్కసారి అయినా థియేటర్ కి వెళ్లి వీక్షించాల్సిందే.
భైరవం మూవీ రివ్యూ
బ్యానర్: శ్రీ సత్య సాయి ఆర్ట్స్
నటీనటులు : బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్, అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై, జయసుధ, వెన్నెల కిషోర్ తదితరులు
సంగీతం : శ్రీచరణ్ పాకాల
సినిమాటోగ్రఫీ : హరి కె వేదాంతం
ఎడిటర్ : ఛోటా కె ప్రసాద్
ప్రొడ్యూసర్: KK రాధామోహన్
దర్శకుడు : విజయ్ కనకమేడల
విడుదల తేదీ-30/05/2025
ముగ్గురు హీరోలు కలిసి నటిస్తున్నారు అంటే ప్రేక్షకుల అటెన్షన్ ఆటోమాటిక్ గా ఆ సినిమాపైకి మళ్లుతుంది. ఆ ముగ్గురు స్టార్ హీరోలైనా, మీడియం రేంజ్ హీరోలైనా, పెద్ద హీరోలైనా, చిన్న హీరోలైనా.. ఎవ్వరైనా కలిసి కనిపిస్తే.. కథ ఎలా ఉండబోతుంది, ముగ్గురు హీరోలు స్క్రిప్ట్ ని ఓకె చేసారు అంటే ఖచ్చితంగా కొత్తగా ఉంటుంది అని ఆలోచిస్తారు. ఛత్రపతి హిందీ రీమేక్ తర్వాత బెల్లకొండ శ్రీనివాస్, తొమ్మిదేళ్లు సినిమాలకు దూరమైన మంచు మనోజ్, సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న నారా రోహిత్ కలిసి నాంది చిత్రంతో దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న విజయ్ కనకమేడల దర్శకత్వంలో గురుడన్ చిత్రానికి రీమేక్ గా భైరవం చిత్రం చేసారు. భైరవం ట్రైలర్, పోస్టర్స్, ప్రమోషన్స్ అన్ని ఈ చిత్రంపై అంచనాలు పెంచాయి, మరి ఆ అంచనాలను నేడు మే 30 న విడుదలైన భైరవం ఎంతవరకు రీచ్ అయ్యింది అనేది సమీక్షలో చూసేద్దాం.
భైరవం స్టోరీ:
భైరవం కథ రొటీన్ గానే కనిపిస్తుంది. అనగనగ దేవీ పురం. ఆ ఊరిలో వారాహి అమ్మవారి గుడి దానికో ధర్మకర్త, ఆమెకో మనవడు, అతనికో స్నేహితుడు. వారాహి అమ్మవారి ఆలయ భూముల పై కన్నేసే విలన్, ఆ విలన్ కో నమ్మినబంటు.. ప్రతి ఫ్రేమ్ లో కథేమిటనేది ఈజీగా అర్ధమైపోతుంది. ధర్మకర్త మనవడికి అతని స్నేహతుడికి, విలన్ నమ్మినబంటుకు మద్యన ఉన్న స్నేహం వైరంగా ఎలా మారింది అనేది భైరవం సింపుల్ స్టోరీ.
భైరవం ఎఫర్ట్స్:
బెల్లంకొండ శ్రీనివాస్ కటౌట్ పరంగా కరెక్ట్ కేరెక్టర్ పడితే చెలరేగిపోతాడు అనే దానికి ఉదాహరణగా భైరవం లోని శ్రీను పాత్ర నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. యాక్షన్ సీక్వెన్స్ లో బెల్లంకొండ ఎనర్జీ సూపర్బ్ అనే చెప్పాలి. నటనలో మరో మెట్టు ఎక్కాడు. ఇక పెరఫార్మెన్స్ పరంగా మంచు మనోజ్ గజపతి వర్మ పాత్ర లో మరో కోణం ఇందులో కనిపిస్తుంది. నెగెటివ్ షేడ్స్ ఉన్న గజపతి పాత్రలో మనోజ్ ఆహార్యం, అతని లుక్ అన్ని పర్ఫెక్ట్ గా సరిపోతాయి. మరో హీరో నారా రోహిత్ పాత్ర హుందాగా ఉంటుంది. హీరోయిన్స్ విషయానికొస్తే ఆనంది, దివ్యా పిళ్లై పాత్రలకు ఇంపార్టెన్స్ ఉంటుంది. వారి వారి పాత్రలకు న్యాయం చేసారు. ఇక అదితీ శంకర్ పాత్ర అయితే రొటీన్ కమర్షియల్ హీరోయిన్లా అనిపించినా ఆమె గ్లామర్ గా బబ్లీ గా ఆకట్టుకుంది. అజయ్, సందీప్ రాజ్ పాత్రలు, గోపరాజు రమణ, ఇనయ సుల్తానా, టెంపర్ వంశీ, సంపత్, శరత్ ఇలా అన్ని పాత్రలు తమపరిధిమేర ఆకట్టుకున్నాయి.
సాంకేతికంగా భైరవం చిత్రానికి ప్లస్ అని చెప్పడానికి.. యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్, శ్రీ చరణ్ పాకాల BGM ఇవి భైరవం చిత్రానికి అతిపెద్ద ప్లస్ పాయింట్స్. శ్రీ చరణ్ పాకాల ముగ్గురు హీరోలకు డిఫ్రెంట్ థీమ్స్ను అదరగొట్టేశాడు. కథలో చూసేందుకు డిస్టర్బ్ చేసినా సాంగ్స్ వినడానికి, చూడటానికి బాగుంటాయి. పెన్ స్టూడియోస్ బ్యానర్, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ విలువలు రిచ్గా ఉన్నాయి.
భైరవం స్క్రీన్ ప్లే:
భైరవం చిత్రం తమిళ గరుడన్ కి రీమేక్ అనేది తెలిసిందే. దర్శకుడు కనకమేడల ఒరిజినల్లోని ఉన్న ట్విస్టుల్ని పెద్దగా మార్పులు చేయకుండా తెలుగులో పెట్టేసుకున్నారు. కాకపోతే తెలుగు భైరవం కి దర్శకుడు కమర్షియల్ టచ్ ఇచ్చే ప్రయత్నమైతే చేసారు. భైరవం ముగ్గురు హీరోల కథ అన్నట్టుగా మారింది. కానీ గరుడాన్ మాత్రం మూడు పాత్రల చుట్టూ తిరిగే కథగా అనిపిస్తుంది. సినిమా స్టార్ట్ అయిన 40 నిమిషాల వరకు నెమ్మదిగానే వెళ్తుంది. కథలో మెయిన్ ట్రాక్ మొదలైన తర్వాత వేగం పెరుగుతుంది. ఫస్ట్ సీన్ నుంచే ముగ్గురు హీరోల మధ్య బాండింగ్ బాగా చూపించాడు దర్శకుడు విజయ్ కనకమేడల. కాకపోతే ఫైట్లు, భారీ యాక్షన్ సీక్వెన్స్ల్ని, లవ్ ట్రాక్ని, బెల్లంకొండ ఇమేజ్ కోసం వాడినట్లుగా సగటు ప్రేక్షకుడు ఫీలయ్యేలా చేసింది.
ఫస్టాఫ్ ఎక్కువగా ఎలివేషన్స్ కోసం టైమ్ తీసుకున్నాడు దర్శకుడు. బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ఇలా ఒక్కొక్కరికీ సపరేట్గా ఎంట్రీ ప్లాన్ చేసాడు. అసలు కథ మొత్తం సెకండాఫ్లోనే ఉంది. ప్రీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ సెకండ్ హాఫ్ పై ఆసక్తిని క్రియేట్ చేసింది. ప్రాణానికి ప్రాణంగా ఉన్న స్నేహితులే చంపుకునే వరకు ఎందుకొచ్చారు అనేది ఈ సినిమాలో మెయిన్ ట్విస్ట్. అది థియేటర్లో చూస్తేనే బాగుంటుంది. ముగ్గురి మధ్య వైరం మొదలైన తర్వాత ఆసక్తికరంగా మారింది కథనం. భైరవం కథ, కథనం కొత్తగా ఏమీ అనిపించకపోయినా.. మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్ పెరఫార్మెన్స్ బోర్ కొట్టించవు. విజయ్ కనకమేడల టెంపుల్ బ్యాక్ డ్రాప్లో కమర్షియల్ యాక్షన్ ఫిలిం గా మార్చే ప్రయత్నం చేసాడు. ఓవరాల్గా ఇంటర్వెల్, క్లైమాక్స్, ముగ్గురు హీరోల పెరఫార్మెన్స్.. కోసం భైరవం చూసేయ్యొచ్చు.
భైరవం ఎనాలసిస్:
కమర్షియల్ చిత్రాలకు ఆదరణ ఎక్కువ. ప్రేక్షకులు డీసెంట్ లవ్ స్టోరీస్, సింపుల్ ఫ్యామిలీ స్టోరీస్ కన్నా ఎక్కువగా కమర్షియల్ హంగులకే పడిపోతారు. అందులో యాక్షన్ ట్రెండ్ నడుస్తున్న సమయంలో భైరవం లాంటి యాక్షన్ ఫిలిం మాస్ ఆడియన్స్ బిగ్ రిలీఫ్. థియేటర్స్ లో ఎంటర్టైన్ చేసే సినిమాలేవి లేకపోవడం భైరవం కి కలిసొస్తుంది. ఇంకా వేసవి సెలవలు ఉండడం కూడా భైరవం చిత్రానికి కలిసొచ్చే అంశం. భైరవం గ్రామీణ నేపథ్యంలో రూరల్ అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాలు చూడాలని కోరుకునే ప్రేక్షకులకు భైరవం చిత్రం బెస్ట్ ఆప్షన్.
పంచ్ లైన్: ముగ్గురు హీరోల భారీ యాక్షన్ భైరవం
రేటింగ్: 2.75/5
సినీజోష్ రివ్యూ: L2 ఎంపురాన్
ది కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ తో
ది పర్ ఫెక్షనిస్ట్ పృథ్వీరాజ్ మలయాళంలో తీసిన
లూసిఫర్ ఎంత సక్సెస్ అయిందంటే
మన మెగాస్టార్ చిరంజీవికి నచ్చి, మెచ్చి
తెలుగులో గాడ్ ఫాదర్ గా రీమేక్ చేసేంత !
అదే లూసిఫర్ కి సీక్వెల్ ప్లాన్ చేసిన
మోహన్ లాల్ అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్
ఈసారి రీమేక్ చేసే ఛాన్స్ ఎవ్వరికి లేకుండా
పాన్ ఇండియా సినిమా గా మలిచారు
లూసిఫర్ సీక్వెల్ L2 ఎంపురాన్ ని !
అద్భుతమైన క్రేజ్ తో.. అనూహ్యమైన ఓపెనింగ్స్ తో
నేడు థియేటర్స్ లోకి ఎంటర్ అయిన ఎంపురాన్
మరి ఏ మేరకు మేజిక్ చేసిందో మన రివ్యూలో తేల్చేద్దాం !
L2 ఎంపురాన్ - విధానం :
లూసిఫర్ ఎక్కడైతే ఎండ్ అయ్యిందో అక్కడినుంచే ఎంపురాన్ కథ స్టార్ట్ అవుతుంది. పెంచిన తండ్రి మరణానంతరం రాష్ట్రాన్ని తమ్ముడు జితిన్ కి అప్పగించి అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు స్టీఫెన్. స్టీఫెన్ తమ్ముడు జితిన్ మాత్రం పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేఖంగా అవినీతికి పాల్పడుతూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న సందర్భంలో మరోసారి స్టీఫెన్ ఎంట్రీ ఇస్తాడు, స్టీఫెన్ తమ్ముడు జితిన్ ని దారిలో పెడతాడా, లేదంటే స్టీఫెన్ అధికారాన్ని తీసుకుని పరిస్థితులు చక్కదిద్దాడా, ఈ క్రమంలో స్టీఫెన్ కి ఆయన అనుచరుడు సయ్యద్ మసూద్ ఎలా సహాయపడ్డాడు అనేది ఎంపురాన్ షార్ట్ స్టోరీ.
L2 ఎంపురాన్ - విచక్షణం :
ఒక కోట కట్టడానికి గట్టిగా పునాది వేసినట్టు సినిమా మొదలైన అరగంట దాటేవరకు ప్లాంటింగ్ సీన్స్ వేసుకుంటూ వెళ్లిన పృథ్వీరాజ్ సుకుమారన్ ఎప్పుడెప్పుడా లాల్ సాబ్ ఎంట్రీ అని ఎదురు చూసిన ప్రేక్షకులకు ఎక్ట్రార్డినరీ ఎపిసోడ్ తో శాటిస్ఫై చేసేసాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం పాత్రల పరిచయాలతో లాగించేసిన పృథ్వీ రాజ్ సెకండ్ హాఫ్ లో మోహన్ లాల్ తో మాయ చేస్తాడనుకుంటే.. ఒకొనొక సమయంలో ఎంపురాన్ రివెంజ్ డ్రామాగా మార్చేసాడా అనిపించకమానదు.
L2 ఎంపురాన్ - విలక్షణం :
నటుడిగా మోహన్ లాల్ కి కొత్తగా వేసే మార్కులు లేవు, ఆయన ఎక్కని మెట్లు లేవు. కానీ ముఖ్యంగా ఈ చిత్రంతో ఎక్కువ మార్కులు కొట్టేసిందీ, మరిన్ని మెట్లు ఎక్కేసిందీ పృథ్వీరాజ్ సుకుమారన్. వీరి తర్వాత మంజు వారియర్, థొవినో థామస్ ల పాత్రాలు కీలకంగా కనిపిస్తాయి. ప్రారంభంలో అభిమన్యు విలన్ పాత్ర ఇంప్రెస్ చేసినా చివరికి వచ్చేసరికి అభిమన్యు పాత్ర రొటీన్ గా మార్చేసారు.
L2 ఎంపురాన్ - విమర్శ:
బాహుబలి అనే టైటిల్ తో ఆ సినిమాతో పాన్ ఇండియా ట్రెండ్ స్టార్ట్ చేసారు రాజమౌళి. ఆపై KGF కానీ పుష్ప కానీ విక్రమ్ కానీ జైలర్ కానీ అందరికి కనెక్ట్ అయ్యే టైటిల్స్ తో ప్యూర్ పాన్ ఇండియా సినిమాలుగా రిలీజ్ అవుతుంటే కొందరు ఎందుకో టైటిల్స్ విషయంలో సరైన శ్రద్ద తీసుకోవడంలేదు. ఇతర సినిమాలు, ఇతర విషయాలు వదిలేసి ఈ పర్టిక్యులర్ సినిమా విషయానికి వస్తే బేసిక్ గా లూసిఫర్ అనేది పాన్ ఇండియా టైటిల్. కానీ మరెందుకో మోహన్ లాల్ అండ్ పృథ్వీ రాజ్ జస్ట్ లూసిఫర్ 2 అనే టైటిల్ పెట్టి ఆ ఫ్రాంచైజీని ముందుకు తీసుకువెళ్లకుండా ఎంపురాన్ అనే మలయాళీ పదంతో ఇతర రాష్ట్రాల ప్రేక్షకులకి అర్ధం కాని టైటిల్ పెట్టారు. సినిమాకి టాక్ బావుండొచ్చు, సినిమాలో కంటెంట్ బావుండొచ్చు. ఏ సినిమాకి జనం థియేటర్స్ కి కదలాలి అంటే ఎంపురాన్ అనే పదం చెప్పగలమా, అర్ధం చేసుకోగలమా.
L2 ఎంపురాన్ - విశ్లేషణ:
లూసిఫర్ సీక్వెల్ అనే క్రేజ్ తో ఆ ఇద్దరి ఉద్దండుల కలయికపై ఉన్న నమ్మకంతో అడ్వాన్స్ బుకింగ్స్ 60 కోట్లు దాటేశాయి. ఇక సినిమా స్క్రీన్ పైకి వచ్చాక ఆ విజువల్స్ ని, ఆ ఎలివేషన్స్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు. లూసిఫర్ ఫ్యాన్స్ ని కంటెంట్ వైజ్ కాస్త డిజప్పాయింట్ చేస్తుందేమో కానీ మోహన్ లాల్ అభిమానులు మాత్రం విచ్చలవిడిగా రెచ్చిపోతారు. కేరళ బాక్సాఫీస్ కి కొత్త రికార్డులు చూపిస్తారు అనేది ప్రస్తుతం వినిపిస్తోన్న రిపోర్ట్.
పంచ్ లైన్: ఎంపురాన్ కాదు ఎంపరర్ !
సినీజోష్ రేటింగ్ : 2.5/5
Tollywood News (English version)
SS Rajamouli participated in the pre-release event of an upcoming movie on Monday evening.
Kingdom is generating buzz across the United States, showcasing impressive momentum in advance ticket sales even two weeks ahead of its official release.
Industry observers are taking note as Kingdom has already locked in 135 shows across 64 locations, demonstrating a robust theatrical footprint for a film still weeks away from its premiere.
Anna Antene is the title of the latest song from Kingdom.
Rashmika Mandanna and Dheekshith Shetty are on a roll in Nadhive, the first song from The Girlfriend.
Prabhas, the pan-India star, shares a unique bond with KGF producer Vijay Kiragandur, viewing him as a family figure.
Former Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy today opined that the movies led by Nandamuri Balakrishna and Pawan Kalyan feature gross dialogues and extreme language.
Kiara Advani and Sidharth Malhotra are overjoyed as they announce the arrival of their baby girl.
Two days into the release of Family Star in 2024, social media stood divided.
Aap Jaisa Koi, the latest Netflix release, has been panned by a section of netizens for "promoting" adultery.
The 100 is headlined by RK Sagar. It co-stars Misha Narang, Dhanya Balakrishna, Anand, and Kalyani Natarajan. The cop thriller is produced by Ramesh Karutoori, Venki Pushadapu, and J Tharak Ram. Ahead of the movie's theatrical release on July 11th, Sagar talks about the movie's highlights. He also throws light on his plans as an actor.
Producer SKN of Taxiwala and Baby has undertaken a series of movie projects. As he turns a year older, in this birthday week, he talks about his projects, and various issues concerning the film industry.
As Thammudu gears up for its release on July 4th, actress Varsha Bollamma opens up about her most challenging role yet. Known for her diverse choices, Varsha delves into the intense preparations, the rugged filming experience in dense forests, and the compelling female characters that drive this highly anticipated film.
Under the banner of Seven Hills Productions, the much-anticipated youthful drama Solo Boy, starring Bigg Boss fame Gautham Krishna alongside Ramya Pasupuleti and Shwetha Avasthi, is all set for its theatrical release on July 4. Producer Satish talks about the movie in this interview.
In his pre-release interviews, producer Dil Raju has emphasized on the word 'experience' while talking about Thammudu. He has projected the film as a theatre-worthy movie. In the making for 150 working days, Thammudu is among the highest-budgeted projects under Sri Venkateswara Creations. Ahead of the release of Thammudu on July 4, Dil Raju talks about the movie, his equations with director Venu Sriram, his rapport with Nithiin, his upcoming projects, and more.
"I was the first artist to be roped in for Thammudu," says Sapthami Gowda, who shot to fame with Kantara in 2022. She is proud to be making her Tollywood debut under a Dil Raju production. In this interview, she talks about her character, saying that writer-director Venu Sriram has shaped every character strongly. Thammudu, which is slated to hit the cinemas on July 4th, is headlined by Nithiin.
"Thammudu is a film rich in family emotions and layered storytelling. It doesn’t follow the conventional 'hero-centric' template. Five women drive the story forward," says director Venu Sriram, talking about Thammudu, his July 4th release. The director, known for MCA and Vakeel Saab, adds that the story of the film is layered.
"Audiences saw me as Meena in Preminchu and as Ratnamala in Missamma. They never saw me as a star heroine. Playing a character artist at this stage in my career feels natural," says actress Laya, who is making a thorough comeback with Nithiin's Thammudu, scheduled to be released in theatres on July 4th. In her latest interview, Laya reveals that she was pursuing a career in the US when film offers started coming her way all over again. When Thammudu came her way, she knew she didn't want to miss out on it. "I got to watch the film while dubbing for my character. It's so content-rich," Laya says.
Actor Rajendra Prasad awaits the release of Shashtipoorthi this May 30. Directed by Pavan Prabha, the family drama co-stars Rupeysh, Archana, and Aakanksha Singh. In this interview, the Nata Kireeti sounds extremely confident when he says that the film happening to him is nothing short of a play of destiny. Catch him throw light on the movie, whose music is by Maestro Ilaiyaraaja.
Actor Rupeysh must be seeing May 30th as the most important day in his life. Shashtipoorthi, a film he has not only fronted but also produced, heads to theatres on the day. Bankrolled by his MAA AAIE Productions (a production house set up in memory of his mother), the family drama is directed by Pavan Prabha. Co-starring Rajendra Prasad, Aakanksha Singh and Archana, the film holds a message for the family audience. In this interview, Rupeysh describes the movie's story as very rare in today's times, when most movies are violence-ridden. "When a script with family values came my way, I was thrilled. While being its producer was gratifying, I enjoyed acting in it," he says. Talking about the pre-release business, he says that non-theatrical revenue streams have been robust for the movie. The theatrical release in the Telugu States will be wide.
About Tollywood
Tollywood refers to the Telugu language film industry. The name derives the concept from Hollywood.Tollywood is based in the state of Andhra Pradesh in southern India. The major Tollywood studios are located in Hyderabad, AP. Tollywood is the largest producer of films in India. In average Tollywood produces between 200 and 250 Telugu movies a year.
Popular movies tend to open during the three festive seasons of the region: Sankranthi, Summer, and Dushera. The Telugu film industry accounts for 1% of the gross domestic product of Andhra Pradesh. Telugu films enjoy significant patronage in the neighboring southern States like Tamil Nadu, Karnataka.
The first Telugu film Bhishma Pratigna was made in 1922 by R.S. Prakash. The first Telugu talkie Bhakta Prahlada, was released in 1931.
Andhra Pradesh is the state having more than 2700 theaters, where Hyderabad alone consists of 150 theatres. It is arguably the state having the largest number of theaters.
For young heroines, waiting for a break in Bollywood - telugu movies are good place to begin with and are considered a gateway. This is because Tollywood is the biggest regional movie market in India and the work there is closely monitored by the big names in Hindi film industry who are on the lookout for storylines to remake and fresh talent be it actors or technicians.